లడఖ్ కోసం సోనమ్ తండ్రి దీక్ష..లేహ్‌కు ఇందిరా!

1
- Advertisement -

సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష లడఖ్ డిమాండ్లను మరోసారి జాతీయస్థాయిలో వెలుగులోకి తెచ్చింది. అయితే దశాబ్దాల క్రితం ఆయన తండ్రి సోనమ్ వాంగ్యాల్ ఈ ప్రాంతానికి ‘షెడ్యూల్డ్ తెగ’ (ST) హోదా కల్పించాలనే డిమాండ్‌తో నిరాహార దీక్ష చేశారు. ఆ సమయంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ లేహ్‌ను సందర్శించి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 1989లో ఒక రాజ్యాంగ ఉత్తర్వు ద్వారా లడఖ్‌కు చెందిన ఎనిమిది గిరిజన తెగలను అధికారికంగా ఎస్టీలుగా (STs) గుర్తించారు.

శనివారం ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 59 ఏళ్ల ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చుట్టూ ఢిల్లీ పోలీసులు అకస్మాత్తుగా తెల్లటి దుప్పట్లను తెరలా అడ్డుపెట్టారు. ఒక మానవ హారంగా ఏర్పడి, గుంపు నుండి ఆయనను వేరు చేస్తూ, పడకపై నుండి లేపి అంబులెన్స్‌లోకి ఎక్కించారు. 21 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.

వైద్యుల సలహా, హైకోర్టు ఆదేశాల మేరకే ఈ చర్య తీసుకున్నామని పోలీసులు చెబుతుండగా….నిర్వాహకులు మాత్రం వాంగ్‌చుక్‌ను బలవంతంగా తరలించారని ఆరోపిస్తున్నారు. ఈ నాటకీయ పరిణామాలు నాలుగు దశాబ్దాల క్రితం నాటి లడఖ్ గతాన్ని గుర్తుచేస్తున్నాయి. నాడు లడఖ్ గొంతుకను దేశానికి వినిపించడానికి వాంగ్‌చుక్ తండ్రి సోనమ్ వాంగ్యాల్ కూడా ఇలాగే నిరాహార దీక్షకు కూర్చున్నారు. నేడు కుమారుడు ఆసుపత్రిలో ఉంటే, నాటి తండ్రి కథ మనల్ని 1984 నాటి రోజుల్లోకి తీసుకెళ్తుంది.

సోనమ్ వాంగ్యాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. 1965లో కేవలం 23 ఏళ్ల వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. 1923లో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఆ తర్వాత లడఖ్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదిగారు. జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా…ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించారు. 1980ల కాలంలో లడఖ్‌కు షెడ్యూల్డ్ తెగ (ST) హోదా సాధించే ఉద్యమంలో ఆయన అత్యంత చురుగ్గా పాల్గొన్నట్లు చరిత్ర చెబుతోంది.

ఆనాడు ఈ డిమాండ్ కేవలం ఒక ప్రభుత్వ లేబుల్ కోసం మాత్రమే కాదు. లడఖ్ సమాజాలు ఆర్థిక, విద్యా రంగాల్లో వెనుకబాటుతనం, రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం మరియు తమ విశిష్ట సామాజిక, సాంస్కృతిక గుర్తింపును కోల్పోతామనే ఆందోళనలను ఎదుర్కొంటున్నాయి. రోడ్ల నిర్మాణం, బయటి వ్యక్తుల ప్రభావం వల్ల స్థానిక సాంప్రదాయ జీవితం వేగంగా మారిపోతున్న తరుణంలో, 1984లో వాంగ్యాల్ ఎస్టీ గుర్తింపు కోసం నిరాహార దీక్షకు దిగారు.

Also Read:హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్!

ఈ ఉద్యమం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దృష్టిని ఆకర్షించింది, దీంతో ఆమె 1984లో లేహ్‌ను సందర్శించారు. వాంగ్యాల్ దీక్ష విరమించినప్పటికీ, ఆ హామీ వెంటనే నెరవేరలేదు, పోరాటం కొనసాగింది.

- Advertisement -