మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది ఇరాన్. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాలు వ్యూహాత్మక జలమార్గంలో సైప్రస్ జెండాతో ఉన్న ‘M/V GFS గెలాక్సీ’ అనే కంటైనర్ నౌకపై దాడి చేసిన తర్వాత, అమెరికా ఇరాన్పై సరికొత్త ప్రతికార దాడుల శ్రేణిని ప్రారంభించింది.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారిక ఎక్స్ (X) పోస్ట్ ప్రకారం, ఒక పౌర సిబ్బంది గల్లంతయ్యారు. ఓడలో మంటలు చెలరేగడం మరియు ఇంజిన్ గది తీవ్రంగా దెబ్బతినడం వల్ల ఆ నౌక తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయింది.
హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న సైప్రస్ జెండాతో ఉన్న కంటైనర్ షిప్ M/V GFS గెలాక్సీపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దళాలు బహిరంగంగా దాడి చేసిన తర్వాత, యుఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు ఇరాన్పై ఈ వారంలో మూడవ విడత దాడులను ప్రారంభించాయి,” అని సెంట్కామ్ (CENTCOM) పేర్కొంది.
గతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ఇరాన్ను బాధ్యులను చేసిన తర్వాత, అవగాహనా ఒప్పందానికి కట్టుబడి ఉండేలా ఇరాన్కు అవకాశం ఇచ్చామని, కానీ అది “మరోసారి విఫలమైందని” సెంట్కామ్ జోడించింది.
దీనికి ప్రతిస్పందనగా, ఈ జలసంధి గుండా స్వేచ్ఛగా వెళ్లే పౌర నావికులు మరియు వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడం ద్వారా అమెరికా భారీ మూల్యాన్ని విధిస్తోంది. కమాండర్ ఇన్ చీఫ్ (అధ్యక్షుడు) ఆదేశాల మేరకు ఈ దాడులు జరుగుతున్నాయి అని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. సెంట్కామ్ ఎక్స్ పోస్ట్కు బదులిస్తూ అమెరికా యుద్ధ కార్యదర్శి (రక్షణ మంత్రి) పీట్ హెగ్సెత్, “ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వారు మూల్యం చెల్లిస్తున్నారు అని రాశారు.
పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా తన “జోక్యాన్ని” ముగించే వరకు ఈ వ్యూహాత్మక జలమార్గం మూసివేయబడుతుందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. విదేశీ శక్తుల అక్రమ జోక్యం వల్ల ఏర్పడిన భద్రతా పరిస్థితుల దృష్ట్యా” ఈ నిర్ణయం తీసుకోబడింది. “తదుపరి నోటీసు వచ్చే వరకు హోర్ముజ్ జలసంధి మూసివేయబడింది మరియు అమెరికా ఈ ప్రాంతంలో తన జోక్యాన్ని ముగించే వరకు ఇది మూసివేయబడే ఉంటుంది. ఈ జలసంధి గుండా ఏ నౌకను వెళ్ళడానికి అనుమతించబోము అని ఐఆర్జీసీ పేర్కొంది.
Also Read:గాయని ఎస్ జానకి కన్నుమూత
జలసంధి మూసివేతను సాకుగా చూపి ఇరాన్పై ఎలాంటి తదుపరి సైనిక చర్యలకు దిగవద్దని ఐఆర్జీసీ నౌకాదళం హెచ్చరించింది.అలాంటి చర్యలకు తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని పేర్కొంది. శత్రువు తానే సృష్టించిన ఈ పరిణామాన్ని సాకుగా వాడుకుని మాపై మరో దురాక్రమణకు పాల్పడితే, దానికి దీటైన సమాధానం ఇవ్వబడుతుంది మరియు ఈ ప్రాంతంలోని మరికొన్ని శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటాము అని హెచ్చరించారు.

