సౌతాంప్టన్లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ ప్రదర్శనను భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించారు. అదే సమయంలో టీమిండియా ఓటమికి ఫీల్డింగ్ లోపంతో పాటు త్వరగా వికెట్లు కోల్పోవడమే ప్రధాన కారణమని చెప్పారు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ల ప్రదర్శనను ఆయన కొనియాడారు. వారి భాగస్వామ్యమే మ్యాచ్ మలుపు తిప్పిందని అయ్యర్ పేర్కొన్నారు.
ఈ సిరీస్ నుండి పరిస్థితులు, అవగాహన మరియు అనుకూలత గురించి తెలుసుకోవడానికి చాలా ఉంది. మేము ఆడిన పిచ్లలో ఇది అత్యుత్తమమైనది మరియు మేము బ్యాటింగ్ చేసినప్పుడు మా విధానం భిన్నంగా ఉంది. మొదటి మ్యాచ్ నుండి పరిస్థితులు మారుతూనే ఉన్నాయి. ప్రొఫెషనల్స్గా మనం విషయాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మారాలి. మనం ఇంకా ఎక్కడ మెరుగ్గా రాణించవచ్చో చర్చించుకోవడం ముఖ్యం. ఫీల్డింగ్ కీలక పాత్ర పోషిస్తుంది, దానిపై మనం మరింత దృష్టి పెట్టాలి అని చెప్పారు.
ముఖ్యంగా విదేశాల్లో ఆడుతున్నప్పుడు, మైదానం కొలతలు భిన్నంగా ఉంటాయి. మేము క్యాచ్లు వదిలేయడం మాపై భారీ ప్రభావం చూపింది.బహుశా మేము 220-225 పరుగులను ఛేజ్ చేసి ఉండేవాళ్లమేమో కానీ అలా జరగలేదు. మేము వరుసగా వికెట్లు కోల్పోయాము. భాగస్వామ్యాలను నిర్మించడం కంటే రన్ రేట్ వేగాన్ని పెంచడంపైనే దృష్టి పెట్టాము. బౌలర్లను టార్గెట్ చేస్తూ కాస్త సమయం తీసుకోవాల్సింది. వారి ప్లాన్స్ పక్కాగా అమలు చేశారు. బట్లర్ అద్భుతంగా ఆడాడు, బ్రూక్ మ్యాచ్ మూమెంటం మార్చేశాడు. ఆ భాగస్వామ్యం వారి ఇన్నింగ్స్ను నిలబెట్టింది అని కొనియాడారు.
Also Read:గాయని ఎస్ జానకి కన్నుమూత

