బెంగాల్ గడ్డకు హాని జరగనివ్వను!

7
- Advertisement -

బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ . రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ, ఆమె బీజేపీని “బంగ్లా-విరోధి జమీందార్లు” (బెంగాల్ వ్యతిరేక భూస్వాములు) అని అభివర్ణించారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.

బీర్భూమ్, పూర్వ బర్ధమాన్, పశ్చిమ బర్ధమాన్ మరియు బంకురా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీలకు సంబంధించిన వీడియోను ఆమె ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. వరుసగా నాలుగవసారి ‘మా-మాటి-మానుష్’ (తల్లి-నేల-ప్రజలు) ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.

నా సోదర సోదరీమణులే నా గొప్ప ఆస్తి. గత 15 ఏళ్లుగా మనం నిర్మించుకున్న ప్రతిదానికీ వారే వెన్నెముక. వారి ప్రేమాభిమానాలకు నేను రుణపడి ఉన్నాను” అని మమతా పేర్కొన్నారు. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ గడ్డకు, ఇక్కడి ప్రజలకు ఎలాంటి హాని జరగనివ్వను. బెంగాల్‌ను కాపాడుకోవడానికి చివరి వరకు పోరాడుతాను అని ఆమె హామీ ఇచ్చారు.

బెంగాల్ ప్రజలను విభజించాలని, రాష్ట్రాన్ని కించపరచాలని చూస్తున్న కుట్రదారులు విజయం సాధించలేరని ఆమె హెచ్చరించారు. కులమతాలకు అతీతంగా అందరూ ఏకమై “బంగ్లా-విరోధి జమీందార్ల”పై పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. సూరి నుండి ఉజ్జల్ ఛటర్జీ, బోల్పూర్ నుండి చంద్రనాథ్ సిన్హా, రాంపూర్‌హట్ నుండి ఆశిష్ బెనర్జీ సహా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీఎంసీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు.

Also Read:‘డెకాయిట్‌’..మంచి సినిమా తీశాం!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -