సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

10
- Advertisement -

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. సోమవారం ఢిల్లీ హైకోర్టు…ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో జస్టిస్ స్వర్ణ కాంత శర్మ విచారణ నుంచి తప్పుకోవాలని (రిక్యూజల్) కోరుతూ కేజ్రీవాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఈ అంశంపై తదుపరి విచారణను ఏప్రిల్ 13న చేపట్టనున్నట్లు తెలిపింది.

“రిక్యూజల్ కోసం దాఖలైన ఈ దరఖాస్తును కోర్టు రికార్డులోకి తీసుకుంటోంది. ఈ దరఖాస్తుకు ముందస్తు నోటీసు ప్రత్యర్థి పక్షానికి అందింది. వారు రేపటిలోగా తమ సమాధానం సమర్పించాలి,” అని కోర్టు పేర్కొంది.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి కోర్టుకు హాజరై, తాను రిక్యూజల్ అప్లికేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించి, దాన్ని రికార్డులోకి తీసుకోవాలని కోరారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ముందుగా ప్రాసిక్యూషన్ వాదనలు వినాలని అన్నారు.

Also Read:అరుణాచల్ సీఎంపై సీబీఐ దర్యాప్తు

ఇంకా, కేజ్రీవాల్ వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలంటే ముందుగా తన న్యాయవాదిని విరమించుకోవాలని మెహతా పేర్కొన్నారు. “ఆయన స్వయంగా వాదించడంపై నాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పటికే న్యాయవాదిని నియమించుకున్నారు. అతన్ని తప్పించకపోతే స్వయంగా వాదించలేరు. ఢిల్లీ హైకోర్టు నాటకాలకు వేదిక కాదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -