అనిల్ అంబానీపై సీబీఐ కేసు

6
- Advertisement -

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఈడీ దాడులతో ఆయన సతమతమవుతుండగా తాజాగా ఆయనపై సీబీఐ కేసు నమోదు అయింది. రూ.2,929.05 కోట్ల రుణ మోసం కేసులో అనిల్‌ అంబానీపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ చర్యలు చేపట్టింది.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనిల్‌ అంబానీని ఇప్పటికే ఫ్రాడ్‌గా గుర్తించిన విషయం తెలిసిందే. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, దాని అనుబంధ సంస్థలు ఎస్బీఐసహా ఆయా బ్యాంకుల నుంచి మొత్తం రూ.31,580 కోట్ల రుణాన్ని తీసుకున్నట్టు తాజా ఫైలింగ్‌నుబట్టి తెలుస్తున్నది.

ఇచ్చిన రుణంలో రూ.13,667.73 కోట్లను రుణ చెల్లింపులు, ఇతర అవసరాలకు వాడుకోవాలని.. అలాగే రూ.12,692.31 కోట్లను కనెక్టెడ్‌ పార్టీల చెల్లింపులకు వినియోగించాలన్నది నిబంధన. కానీ 2016లో రుణ చెల్లింపులకు రూ.6,265.85 కోట్లను, కనెక్టెడ్‌ పార్టీలకు రూ.5,501.56 కోట్లనే ఇచ్చారని ఎస్బీఐ వాదన.

Also Read:నాడు పీసీసీ చీఫ్‌గా..నేడు సీఎంగా

- Advertisement -