బిహార్ ప్రజల ఓట్లను దొంగలిస్తే..ఊరుకోం

7
- Advertisement -

బిహార్ ప్రజల ఓట్లను బీజేపీ, ఎన్నికల సంఘం దొంగిలిస్తే ఊరుకోమని హెచ్చరించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బిహార్‌లోని సీతామఢీలో నిర్వహించిన ఓటర్‌ అధికార్‌ యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ …బిహార్​లో ఓట్ల దొంగిలించడాని ప్రయత్నిస్తున్నారని మాకు తెలుసు కానీ బిహార్ ప్రజలు తెలివైనవారు అన్నారు.

బీజేపీ, ఎన్నికల కమిషన్ బిహార్​లో ఒక్క ఓటును కూడా దొంగిలించనివ్వరని తెలుసుకోవాలి…. మేం ఇక్కడ ఓటర్‌ అధికార్‌ యాత్రలో ప్రారంభించాం అన్నారు. బిహార్ ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది పేదల పేర్లు తొలగించారని పేర్కొన్నారు. ఓట్ల చోరీ జరిగిందని నిరూపించేందుకు భవిష్యత్​లో మరిన్ని ఆధారాలు చూపిస్తానని చెప్పారు.

ఇది కేవలం ఓటు హక్కు గురించి కాదు. ఎందుకంటే ఓటు పోతే భారత్​లోని పేద ప్రజలకు ఏం మిగలదు. ఓటుతో మొదలై తర్వాత రేషన్ కార్డ్, భూమి అలా ప్రతిదీ పోతుంది అని తెలిపారు. ఈ యాత్రలో బిహార్ ప్రజలు మాకు తోడుగా ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటివరకు, నేను కర్ణాటకకు మాత్రమే రుజువు ఇచ్చా… రాబోయే కాలంలో, లోక్‌సభ ఎన్నికలు, హరియాణా ఎన్నికల్లో కూడా ఓట్ల చోరీ జరిగిందిని ఆధారాలు ఇస్తానని చెప్పారు.

Also Read:నిద్రమత్తులో కాంగ్రెస్ నేతలు..హరీష్ ఫైర్

- Advertisement -