Budget 2025:కొత్తగా ధన్ ధాన్య యోజనా పథకం

1
- Advertisement -

బడ్జెట్ 2025ని ప్రవేశ పెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా..దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నారు. విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు నిర్మలా.

స్టార్టప్‌లకు రూ.20 కోట్లు,పోస్టర్ రంగానికి కొత్త జవసత్వం తీసుకొస్తామన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణాలు పెంపు,స్టార్టప్‌ల కోసం ఫండ్ అప్ ఫండ్,కోటి 70 లక్షల మంది రైతులకు ధన్ ధాన్య యోజన్,జీరో పేదరికం మా లక్ష్యం అన్నారు. పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల ప్రణాళిక,గ్రామీణ ప్రాంతాల నుండి వలసల నివారణకు ప్రత్యేక చర్యలు,గ్రామీణ పీహెచ్‌సీలో ఇంటర్నెట్ సౌకర్యం,కూర గాయలు, పండ్ల ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామన్నారు.

ఎంఎస్‌ఎంఈలకు అధిక ప్రాధాన్యత,దేశంలో కొత్తగా 3 యూరియా ప్లాంట్ల ఏర్పాటు,బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చే వడ్డీ రాయితీ రూ. 3లక్షల నుండి రూ.5లక్షలకు పెంపు,లెదర్, ఫుట్‌వెర్ సెక్టార్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read:గ్యాస్ వినియోగదారులకు శుభవార్త

- Advertisement -