వరల్డ్ కప్ గెలుపుపై స్టార్ల రియాక్షన్

44
- Advertisement -

భారత్ తప్పకుండా వరల్డ్ కప్ గెలుస్తుందని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల సెమీ ఫైనల్స్ మ్యాచ్ ప్రత్యక్ష్యంగా వీక్షించిన రజనీకాంత్, భారత ఆటగాళ్ళ ప్రదర్శనను కొనియాడారు. మొదట్లో కాసేపు టెన్షన్ పెట్టినా తదనంతరం మ్యాచ్ ను పూర్తిగా మార్చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో స్పిన్నర్ అశ్విన్‌తో రజనీకాంత్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక మరోవైపు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌‌ను భారత క్రికెట్ అభిమానులు ఓ వింత కోరిక కోరుతున్నారు.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడొద్దని బిగ్ బీకి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. అభిమానుల ఈ వింత కోరిక వెనుక ఓ బలమైన కారణమే ఉంది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో భారత జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తాను మ్యాచ్ చూడనందుకు భారత్ గెలిచిందంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. అందుకే, అమితాబ్ బచ్చన్ ఫైనల్ మ్యాచ్ కూడా చూడకుండా ఉంటే.. భారత్ గెలుస్తుంది అని నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఫైనల్ మ్యాచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ గెలువాలని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.అయితే భారత్ గెలిస్తే బంపర్ ఆఫర్ ఇస్తానని తెలుగు హీరోయిన్ రేఖా భోజ్ ప్రకటించారు. ఇండియా వరల్డ్ కప్ కొడితే… వైజాగ్ బీచ్ లో బట్టలిప్పి ఊరేగుతానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.రేఖా వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదేం ఆలోచనని కొందరు… ఎదురు చూస్తున్నామని మరికొందరు రిప్లై ఇచ్చారు.

Also Read:Mangalavaram:‘మంగళవారం’ పరిస్థితి ఏమిటి ? 

- Advertisement -