డైరెక్టర్‌ పై హీరోయిన్ కి అసంతృప్తి

29
- Advertisement -

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే జవాన్‌ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో నయన్ నటనకు మంచి ప్రశంaసలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ, ప్రస్తుతం కోలీవుడ్‌లో మాత్రం ఈ సినిమాలో నయనతారకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే వార్త వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ డైరెక్టర్ అట్లీపై నయన్‌ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, ఆమె జవాన్ సక్సెస్ మీట్ కు కూడా రాలేదు అని, రీసెంట్ గా దర్శకుడు అట్లీ ఎదురు పడినా నయనతార పక్కకు తప్పుకుని వెళ్ళిపోయింది అని టాక్ నడుస్తోంది.

ఇక బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఈ జవాన్ మూవీ రూ.900 కోట్ల కలెక్షన్ల క్లబ్ లో చేరింది. రిలీజైన 13వ రోజు ఈ మూవీ ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 13 రోజులు కలిపి ఏకంగా రూ.907.54 కోట్లు వసూలు చేసింది. మరో రెండు రోజుల్లో జవాన్ మూవీ రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది మొదట్లో పఠాన్ మూవీతో తొలిసారి రూ.1000 కోట్ల మార్క్ అందుకున్నారు షారుక్.ఇప్పుడు జవాన్ తో కూడా షారుఖ్ ఖాన్ రూ.100 కోట్లు మార్కెట్ ను అందుకునేలా ఉన్నాడు.

Also Read:IND VS AUS:తొలి మ్యాచ్‌ లో సత్తా చాటేదేవరు?

ఇదిలా ఉంటే.. జవాన్‌ సినిమాలో ట్రైన్ సీన్ ను ఓ యువకుడు రీక్రియేట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో షారుక్ ట్రైనులో పడుకునట్టే ఈ యువకుడు కూడా ట్రైనులో పడుకున్నాడు. తలకి, చేతులకు కట్లతో ట్రైను ఎక్కుతుంటే అక్కడున్న వారందరూ అతడినే చూస్తుండిపోయారు.

Also Read:ఒత్తిడి ఎక్కువైతే.. అల్జీమర్ వ్యాధి వస్తుందా?

- Advertisement -