కడియంకు మద్దతు ప్రకటించిన రాజయ్య..

17
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్‌లో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. కడియంకు ఘన్‌పూర్ టికెట్ కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్న రాజయ్య..మంత్రి కేటీఆర్ హామీతో వెనక్కితగ్గారు. కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి గెలుపుకోసం కృషిచేస్తానని చెప్పారు రాజయ్య.

రాజయ్యకు పార్టీ అండగా ఉంటుందని, ఆయనకు సముచితమైన స్థానం కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన రాజయ్యకు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

తనకు టికెట్ కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజయ్య…కొంతకాలంగా తనకే మళ్లీ టికెట్ వస్తుందని ప్రచారం చేస్తూ వచ్చారు. అంతేగాదు తన సామాజిక వర్గాన్ని తెరపైకి తీసుకొచ్చి ఒత్తిడి తెచ్చే విధంగా చేశారు. ఓ దశలో రాజయ్య కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగినా మంత్రి కేటీఆర్ హామీతో వెనక్కితగ్గారు.

Also Read:ఒత్తిడి ఎక్కువైతే.. అల్జీమర్ వ్యాధి వస్తుందా?

- Advertisement -