Rahul Gandhi:భారత్ మాత..ప్రతీ భారతీయుడి గొంతుక

24
- Advertisement -

దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాహుల్. భారత్ మాత..ప్రతీ భారతీయుడి గొంతుక అన్నారు.

సముద్రం అంచున కన్యాకుమారి నుంచి మంచు కశ్మీరు వరకు తన 145 రోజుల భారత్ జోడో పాదయాత్ర అనుభవాన్ని రాహుల్ ఈ సందర్భంగా పంచుకున్నారు. గత సంవత్సరం భరత భూమి మీదుగా 145 రోజులు నడిచాను, సముద్రం అంచున ప్రారంభించి వేడి, దుమ్ము, వర్షం గుండా నడిచాను. అడవులు, పట్టణాలు, కొండల గుండా మృదువైన కశ్మీర్ మంచు ప్రాంతానికి చేరుకున్నాను అని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నొప్పితో యాత్ర ఆపేయాలని అనుకున్న ప్రతీసారి పలువురు వచ్చి నాకు శక్తిని బహుమతిగా ఇచ్చారని గుర్తు చేశారు రాహుల్.

Also Read:మీ శరీర భాగాలు జాగ్రత్త..

- Advertisement -