హైదరాబాద్ ఓఆర్ఆర్ అవతల నిర్మించతలపెట్టిన ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్లో కీలకమైన ముందడుగు పడింది. ఈ ఆంశం గతేడాది నుంచి పరిశీలనలో ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం అమోదం లభించింది. ఈ ప్రాజెక్ట్కు కేంద్రం భారత్మాల 2.o కింద చేపట్టనుంది. కేంద్రం 347.80 కి.మీ మేర ఉత్తర, దక్షిణ భాగాలుగా ఆర్ఆర్ఆర్ ను రూపొందించనున్నారు. అయితే మొదట్లో ఈ వ్యయం సూమారుగా 22వేల కోట్లు అంచనా వేయగా తాజాగా 25 నుంచి 26వేల కోట్లకు అంచనా పెరిగింది.
Also Read: CM KCR:హరే కృష్ణ హెరిటేజ్ టవర్కు భూమిపూజ
దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భూసేకరణ వ్యయంను భరించనుంది. ఇప్పటికే ఉత్తర భాగంకు భూములను సేకరించింది. దక్షిణ భాగంలోని ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేటు భూములు వాటి సేకరణకయ్యే ఖర్చు తగ్గగా నిర్మాణ వ్యయం పెరగునుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా డీపీఆర్ను సిద్దమని ఆధికారులను ఆదేశించింది. దక్షిణ భాగంను 189కి.మీలకు గాను రూ.14.5వేల కోట్లు అంచనావేసింది. చౌటుప్పల్, ఆమనగల్లు, షాద్నగర్, చేవెళ్ల, సంగారెడ్డి పట్టణాల గుండా ఆర్ఆర్ఆర్ వెళ్లనుంది.
Also Read: KTR: ప్రతిపక్షాల మాటలకు ఆగం కావొద్దు