ప్రభాస్ నీల్‌ల కాంబోలో మరో కొత్త సినిమా..!

45
- Advertisement -

పాన్ ఇండియా యాక్టర్‌ ప్రభాస్ కేజీఎఫ్ ఫేం దర్శకుడు ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా సలార్‌. ఇప్పటికే 90శాతం షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా..జూన్‌లో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో మరో కొత్త సినిమా రానున్నట్టు ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత దిల్‌రాజు ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌ చెప్పారు.

ఓ ఇంటర్వ్యూలో దిల్‌రాజు మాట్లాడుతూ..త్వరలోనే ప్రభాస్ ప్రశాంత్ నీల్‌ల కాంబినేషన్‌లో ఓ పౌరాణిక సినిమా రానుంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ సలార్‌తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా తీయనున్నట్టు సమాచారం. ఇవ్వన్నీ పూర్తయ్యక ప్రభాస్‌ సినిమా మొదలవుతోంది.

ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలో ఉందని చెప్పారు. దీంతో ఈ వార్తతో ప్రభాస్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుష్‌ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్‌-కే సినిమా సలార్‌ ఆదిపురుష్‌ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి…

Prabhas:సలార్ టీజర్ అప్పుడే!

మెగాస్టార్ ఊ అంటారా ?

‘అన్ స్టాపబుల్’.. అన్ లిమిటెడ్ ఎంటర్ టైనర్

- Advertisement -