రూ.500లకే గ్యాస్ బండ: రేవంత్ రెడ్డి

46
- Advertisement -

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పాదయాత్రలో భాగంగా భద్రాచలంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్ళు లేని పేదలందరికి 5లక్షలు, రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం అని తెలిపారు. అలాగే బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తాం అన్నారు.

బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్. బీజేపీ..బుడబుక్కల పార్టీ అని… కోడిగుడ్డు మీద బొచ్చు వచ్చేది లేదు. తెలంగాణలో బిజెపి వచ్చేది లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ లేదంటావా. కొత్త సంవత్సరం 2024 జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు. రామరాజ్యం అంటే ఎన్ని యుగాలైనా ఆదర్శ పరిపాలన ఉండాలన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -