సచిన్‌ ఓ కరోనా..గెహ్లాట్ పంచ్‌..!

34
- Advertisement -

రాజస్థాన్ కాంగ్రెస్‌లో మరోసారి ముసలం రాజుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్ – సచిన్ పైలట్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సచిన్ పైలట్‌ని కరోనాతో పోల్చిన గెహ్లాట్‌కి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

అది పాత వీడియోనే అయినప్పటికీ అందులో గెహ్లాట్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కరోనా సంక్షోభం తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోకి పెద్ద కరోనా ప్రవేశించిందని పరోక్షంగా సచిన్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే ఎక్కడా ఆయన మాజీ డిప్యూటీ సీఎం పేరును ప్రస్తావించలేదు.

రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. గతంలో సచిన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న గెహ్లాట్‌.. ఆయనను చీడపురుగుతో పోల్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -