చైతు దర్శకుడితో విజయ్ ?

9
- Advertisement -

మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా తీసి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చెరిపోయాడు పరశురామ్. ఈ సినిమా కంటే ముందు కమిట్ అయిన నాగ చైతన్య ప్రాజెక్ట్ ను పరశురామ్ ఇప్పుడు చేయాల్సి ఉంది. 14 రీల్స్ ప్లస్ బేనర్ లో ఈ కాంబో సినిమా అనుకున్నారు. కానీ తాజాగా చైతు -పరశురామ్ మూవీ క్యాన్సల్ అయిందని అంటున్నారు.

నాగ చైతన్య కి పరశురామ్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చింది కానీ చైతు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయలేని పరిస్థితి ఉందని టాక్. అందుకే మళ్ళీ గీత గోవిందం కాంబోనే సెట్ చేసుకునే ప్లానింగ్ లో ఉన్నాడట పరశురామ్ . తాజాగా విజయ్ దేవరకొండ కి ఓ స్క్రిప్ట్ చెప్పి లాక్ చేసుకున్నాడాని సమాచారం. ప్రస్తుతం విజయ్ ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమంత డేట్స్ వల్ల ఆలస్యం అవుతుంది. అందుకే తన నెక్స్ట్ లైనప్ ను స్పీడప్ చేసుకుంటున్నాడు విజయ్.

జెర్సీ దర్శకుడు గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్న విజయ్ దానితో పాటే పరశురామ్ తో మరో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడాని సమాచారం. త్వరలోనే ఈ కాంబో సినిమాపై ఆఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -