ఢిల్లీకి సీఎం కేసీఆర్

89
- Advertisement -

సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. నాలుగు లేదా ఐదు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం. ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభానికి సిద్ధమైంది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ముందు రోజే హస్తినకు చేరుకోనున్నారు.

14వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమం మొదలవుతుంది. అక్కడ నిర్వహించే రాజశ్యామల యాగం కోసం యాగశాలను నిర్మిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎంపీ సంతోష్,మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించే సభలో ఆయన మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నాయకులకు, ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -