బంగ్లాతో టెస్టు..టీమిండియా జట్టు ఇదే!

665
- Advertisement -

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. 17 మందితో కూడిన టెస్టు జట్టును ప్రకటించగా గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యారు. రోహిత్ శర్మ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌, షమీ, జడేజాల స్థానంలో నవదీప్ సైని, సౌరభ్ కుమార్‌‌లను ఎంపిక చేసింది. కెప్టెన్సీ బాద్యతల్ని కేఎల్ రాహుల్‌కి అప్పగించింది.

ఈ నెల 14 నుండి తొలి టెస్టు సిరీస్ ప్రారంభంకానుండగా సెకండ్ టెస్టు 22 నుంచి 26 వరకు జరగనుంది. ఇప్పటికే జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లా 2–1 సొంతం చేసుకుంది.

జట్టు వివరాలు:

కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా (వైస్‌ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (w/k), కేఎస్ భరత్ (w/k), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, నవదీప్ సైని, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్

ఇవి కూడా చదవండి..

- Advertisement -