ఈయేడాది ఇదే లాస్ట్‌ ప్రయోగం:ఇస్రో

212
- Advertisement -

ఇస్రో ఈ యేడాది ఆఖరిగా నిర్వహించే ప్రయోగమని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. నవంబర్ 26న ఉదయం 11.56గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ-సీ54/eos-06ను ప్రయోగనించనుంది. ఉదయం 10.26 నిమిషాలకి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు. రేపు సరిగ్గా 11.56 గంటలకు రాకెట్ ప్రయోగం చేయనున్నట్టు ఆయన తెలిపారు. పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్ ద్వారా 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నామన్నారు.

2022వ సంవత్సరానికి గాను ఇదే ఆఖరి పరీక్ష అని తెలిపారు. కాగా డిసెంబర్‌లో అగ్నికుల్ ప్రయివేటు సంస్థ ఆధ్వర్యంలో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇస్రో వెల్లడించింది. 2023 ఫిబ్రవరి నెలలో జీఎస్ఎల్వీ – మార్క్-3 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నామన్నారు. కాగా కౌంట్‌డౌన్‌ ప్రారంభమయ్యాక రాకెట్‌ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. షార్‌ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లో 56వ ప్రయోగం.

ఇవి కూడా చదవండి…

దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ముందంజ..

రామప్ప తెలంగాణ వారసత్వము:వీ.ప్రకాశ్‌

ఎమ్మెల్యేల కొనుగోలు..నిందితుల రిమాండ్ పొడగింపు

- Advertisement -