వివేకాను చంపింది ఎవరో తెలిసిపోయింది:నారాయణ

52
cpi
- Advertisement -

వైఎస్ వివేకాను చంపింది ఎవరో తెలిసిపోయిందన్నారు సీపీఐ జాతీయ నేత నారాయణ. వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచిన నేపథ్యంలో స్పందించిన నారాయణ.. వివేకా హ‌త్యపై ఇక విచార‌ణే అవ‌స‌రం లేద‌ని, వివేకాను చంపిందెవ‌రో ఇప్పటికే అంద‌రికీ తెలిసిపోయింద‌న్నారు. వివేకా హత్యకు వైఎస్ కుటుంబీకులే నైతిక బాధ్యత వ‌హించాల‌ని డిమాండ్ చేశారు.

వివేకా హ‌త్యకు సంబంధించి మీడియాలో లెక్కలేన‌న్ని క‌థ‌నాలు వ‌స్తున్నాయని.. వివేకా హ‌త్య కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐపై కూడా ఎదురు దాడి జ‌రుగుతోంద‌న్నారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంద‌ని వ్యాఖ్యానించారు.

- Advertisement -