- Advertisement -
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు.
చంద్రబాబు తనయుడు లోకేష్ సైతం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు.
- Advertisement -