గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ ఎంపీ..

246
gic
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు బాహుసాహెబ్ ఆర్ వాక్చవురే గారు , షిరిడి , మహారాష్ట్ర .గౌరవ రాజ్యసభ సభ్యులు ఎంపీ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన నివాసం లో జాస్మిన్ మొక్క నాటారు . తన తో పాటు కేంద్ర సెన్సార్ బోర్డు మెంబెర్ ఎడ్ల రవికుమార్ పటేల్ గారు ఉన్నారు .

ఈ సందర్బంగా తను మాట్లాడుతూ తను వృత్తి రీత్యా న్యాయవాది అవడం వల్ల హైదరాబాద్ హై కోర్టు లో తనకు మిత్రులు ఉన్నారని , తన కుమారుడు వివాహం 2018 లో జరిగినప్పుడు సంతోష్ ప్రేమతో కేసీఆర్ గారిని కల్పించారని , తాను చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి తనవంతు సహకారం అందిస్తానని , మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో తృప్తి నిస్తుందని తెలిపారు . అయన శివ కుమార్ టిటిడి బోర్డు మెంబెర్ హైదరాబాద్ మరియు ఇతర మిత్రులకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని కోరారు . ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ..

- Advertisement -