ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోండి: పార్థసారధి

149
ec
- Advertisement -

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, మాస్క్‌ ధరించి పోలింగ్‌ కేంద్రాలకు రావాలని సూచించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి. ఫ్యామిలీతో కలిసి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-4లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని తెలిపారు.లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌, మైక్రో అబ్జర్వర్ల ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు.ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు.

ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, స్టాటిస్టిక్స్ సర్వే టీమ్‌లు చురుగ్గా పని ప్రారంభించాయన్నారు. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య వస్తే 105 స్ట్రైకింగ్ ఫోర్స్ సిద్ధంగా ఉందని చెప్పారు. అలాగే 56 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్‌ను ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -