జీజేపీ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతోంది- హరీష్‌

133
harish
- Advertisement -

శనివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి హరీష్‌ రావు పటాన్‌చెరు డివిజన్‌లో పర్యటించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతుగా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వదించి పంపించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మెట్టు కుమార్‌ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని సంఘం సభ్యులను మంత్రి కోరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి చేసేవాళ్లు కావాలో..బాంబులు వేసి కూలగొట్టేవాళ్లు కావాలో నిర్ణయించుకోవాలని ఓటర్లకు మంత్రి హారీష్‌ రావు సూచించారు. జీజేపీ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్మించారు.

సర్జికల్‌ స్ట్రైక్స్‌ అభివృద్ధి మీద, నిరుద్యోగం మీద, పేదరికం మీద చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్జికల్‌ స్ట్రైక్స్‌కి సంబంధం ఉందా అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోంటే..టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి కాపాడుతోందన్నారు. భారతీయ జనతా పార్టీ చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రశాంత వాతవరణం ఉన్నప్పుడే పెట్టుబడులు పుష్కలంగా వస్తాయన్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటీకే చెత్తులెత్తేసిందన్నారు. మతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య విభజన రాజకీయాలకు తెర తీసిందని మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు.

- Advertisement -