ఇంటి ఇంటి ప్రచారంతో దుసుకుపోతున్న మంత్రి ఎర్రబెల‌్లి..

142
errabelli
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్‌పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్‌లో అన్ని కాలనీలలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుదాస్‌తో కలిసి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పర్యటిస్తున్నారు. ఇందులో భాగాంగా NSL,NOMULA,SAGAR అపార్టుమెంటు అసోసియేషన్ లు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని తీర్మానం చేశారు.

అలాగే హౌసింగ్ బోర్డు కాలనీ ఫేస్ 1 గ్రౌండ్‌లో మునిసిపల్ కార్మికులు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయ్యమని మంత్రి ఎర్రబెల్లి కోరారు. అదేవిధంగా రాజీవ్ నగర్‌లో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. రాజీవ్ నగర్‌లోని క్రైస్ట్ గాస్పెల్ బాప్టిస్ట్ చర్చిలో మంత్రి ఎర్రబెల్లి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తామని క్రైస్తవ పాస్టర్లు తీర్మానించారు.

- Advertisement -