- Advertisement -
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఇంట్లో దివాళి సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కరోనాని జయించిన సంతోషంలో దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకోగా భార్య జీవిత , ఇద్దరు కూతుళ్ళతో కలిసి రాజశేఖర్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజశేఖర్ కూతుళ్ళిద్దరు ప్రస్తుతం ఇండస్ట్రీలో కథానాయికలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
ఇటీవలె రాజశేఖర్తో పాటు ఆయన సతీమణి జీవిత, కూతుళ్ళు శివాణి, శివాత్మికలు కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.శివాణి, శివాత్మికలు త్వరగానే కరోనా నుండి కోలుకున్నా, రాజశేఖర్, జీవితలు చాలా రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. ఇక రాజశేఖర్ పరిస్థితి విషమంగా మారిన ఆయన కూడా కరోనాను జయించారు.
- Advertisement -