వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌…ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్!

247
prakash raj
- Advertisement -

కరడుకట్టిన నేర‌గాడు, కాన్పూర్‌కు చెందిన‌ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. నిన్న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో వికాస్‌ను పోలీసులు పట్టుకోగా ఇవాళ కాన్పూర్ తరలిస్తుండగా కాన్వాయ్‌లోని ఓ కారు బోల్తా పడింది. దీంతో ఇదే అదునుగా తప్పించుకోవడానికి వికాస్ ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. వికాస్‌ మృతదేహాన్ని కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు.

ఇక వికాస్ ఎన్‌కౌంటర్‌పై ఆసక్తికర ట్వీట్ చేశారు సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్. 5 రోజుల్లో గ్యాంగ్‌స్టర్ వికాస్‌ని హతమార్చారు….మరి ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న desh ki vikas(దేశ అభివృద్ధి) సంగతేంటంటూ మోడీ సర్కార్‌ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రకాశ్‌ రాజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -