- Advertisement -
ఇంటర్ పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ప్రధమ, ద్వితియ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 95.72 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 4 నుండి 23 వరకు పరీక్షలు జరిగాయి.
- Advertisement -