కేంద్రం-రైతు సంఘాల మధ్య 9వ దఫా చర్చలు విఫలం..

226
Farmers Protest
- Advertisement -

కేంద్రం-రైతు సంఘాల మధ్య చర్చలు మరోమారు అసంపూర్తిగా ముగిసిశాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేఖ చట్టాలపై శుక్రవారం కేంద్రం,రైతు సంఘాల మధ్య తొమ్మిదో దఫా చర్చలు జరిగాయి. ఈ నేసథ్యంలో ఈనెల 19న మరోమారు సమావేశం కావాలని కేంద్రం నిర్ణయించింది. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్న తమ డిమాండును రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు మరోసారి గట్టిగా వినిపించారు.

పంటలకు కనీస మద్దతుధరను చట్టబద్ధం చేయాలని కోరారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ)ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాలను ఆపాలని కోరారు. అయితే, కేంద్రం మాత్రం తమ పట్టు విడువకుండా కఠినంగా వ్యవహరిస్తోంది. తమ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే సమస్య లేదని మరోసారి స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రతిష్టంభనకు కారణమైన ఏ అంశంలోనూ స్పష్టత రాలేదు.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను బలహీనపరిచే ఉద్దేశం తమకు లేదని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ రైతులు, ఆ విషయాన్ని నమ్మేందకు తాము సిద్ధంగా లేమని మంత్రికి స్పష్టం చేశారు. ప్రజల కోసం ఇంకెన్నిసార్లు అయినా చర్చలకు వచ్చేందుకు సిద్ధమని కేంద్రమంత్రుల బృందం పేర్కొంది. ఈ క్రమంలో ఈ నెల 19న మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి చర్చలు జరపాలని ఇరువర్గాలు నిర్ణయించాయి.

- Advertisement -