దేశంలో 24 గంటల్లో 96,982 కరోనా కేసులు…

155
corona
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 96,982 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 446 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,26,86,049కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 7,88,223 యాక్టివ్ కేసులుండగా 1,17,32,279 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 1,65,547 మంది ప్రాణాలు కోల్పోయారు.
టీకా డ్రైవ్‌లో భాగంగా 8,31,10,926 డోసులు పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 47,288 కేసులు నమోదుకాగా ఛత్తీస్‌గఢ్‌లో 7,302, కర్ణాటకలో 5,279 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -