దేశంలో 24 గంటల్లో 9,629 కరోనా కేసులు

27
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,79,031 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,629 మందికి పాజిటివ్‌గా తేలింది. 29 మంది ప్రాణాలు కొల్పోయారు. ఇక ప్రస్తుతం దేశంలో 61,013 కేసులు యాక్టివ్‌గా ఉండగా కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,23,045కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 5,31,398 మంది మృతిచెందారు.

మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.14 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read:కరెంట్ బిల్లుల వసూలు..పాతబస్తీ టాప్‌

- Advertisement -