ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..

134
corona
- Advertisement -

ఏపీలో గడచిన 24 గంటల్లో 31,680 కరోనా పరీక్షలు నిర్వహించగా 88 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. అదే సమయంలో 72 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,89,298 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,511 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 620 మందికి చికిత్స జరుగుతోంది. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 7,167గా నమోదైంది. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 21 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 19, విశాఖ జిల్లాలో 11 కేసులు గుర్తించారు. కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

- Advertisement -