దేశంలో ఆగని కరోనా మరణాలు..

234
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 84,332 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 4002 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,93,59,155కు చేరాయి. ప్రస్తుతం దేశంలో 10,80,690 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 2,79,11,384 మంది బాధితులు కోలుకున్నారు. కరోనాతో 3,67,081 మంది మృతిచెందగా టీకా డ్రైవ్‌లో మొత్తం 24,96,00,304 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు 95.07శాతంగా ఉండగా వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతానికి పడిపోయింది.

- Advertisement -