విరుచుకుపడ్డ హిమపాతం..7గురు మృతి

10
- Advertisement -

హిమపాతం విరుచుకపడిన ఘటనలో ఏడుగురు పర్వతారోహకులు మృతి చెందారు. నేపాల్ లోని 18,471 మీటర్ల యాలంగ్ రి పర్వతాన్ని అధిరోహిస్తుండగా ఒక్కసారిగా విరుచుకుపడింది హిమపాతం.

15 మంది బృందంలో ఏడుగురు మృతి చెందగా మరో నలుగురు గల్లంతు అయ్యారు. మృతుల్లో ముగ్గురు ఫ్రెంచ్ అధిరోహకులు, ఒక కెనెడియన్, ఒక ఇటాలియన్, ఇద్దరు నేపాలీలు ఉన్నారు.

మొత్తం 15 మంది (అందులో 5 మంది విదేశీ పర్వతారోహకులు, 10 మంది నేపాలి ఎత్తు ప్రాంత కార్మికులు) పాల్గొన్న ఎక్స్పెడిషన్‌పై ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో మంచు చరియ దాడి చేసింది. ఈ ఘటనలో మరో నలుగురు నేపాలీలు గాయపడ్డారు. మాకు సమాచారం ఆలస్యంగా వచ్చింది, అంతేకాకుండా వాతావరణం దారుణంగా ఉండటంతో తక్షణ స్పందన ఆలస్యమైందిఅని పోలీసులు తెలిపారు.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు?

- Advertisement -