ఆరో దశ ఎన్నికలు..నోటిఫికేషన్ రిలీజ్

8
- Advertisement -

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. బిహార్, హరియాణా, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరుగుతుంది.అభ్యర్థులు ఇవాళ్టి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది.ఏడో దశలోనూ దేశంలోని 57 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1న ఈ చివరి దశ ఎన్నికలు నిర్వహిస్తారు. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇప్పటివరకు తొలి రెండు దశల్లో ఎన్నికలు ముగియగా తొలి దశలో 102, రెండో దశలో 89 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

Also Read:దేవరలో అల్లరి నరేష్..క్లారిటీ!

- Advertisement -