రేవంత్ కంటే కేసీఆర్ బెటర్:మోత్కుపల్లి

50
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ అన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగతో కలిసి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి…రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్డిల రాజ్యం నడుస్తోందని…సీఎం తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

ఒకే కులానికే 9 సీట్లు ఇచ్చారని, ఇదెక్కడి అన్యాయమని..రానున్న ఎన్నికల్లో మాదిగల శక్తిని చూపిస్తామని హెచ్చరించారు. మాదిగలు, బీసీలు పార్లమెంట్‌కు పోవద్దా, రెడ్లు మాత్రమే పార్లమెంట్‌కు వెళ్లాలా? ,మాదిగలను రాజకీయాలకు బలి చేసే కుట్ర జరుగుతోందన్నారు.

మాదిగలను పక్కకుపెట్టి కనీసం ఓటు బ్యాంకు లేని వారికి ఎంపీ సీట్లు కేటాయించారు. 4 నెలలకే మొత్తం మారిపోయిందన్నారు. రేవంత్ సీఎం అయితే బాగుంటుంది అని చెప్పిన వ్యక్తిని నేను..కానీ ఇప్పుడు బాధ పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 లక్షల మంది మాదిగల పరిస్థితి ఏంటి? …కడియం శ్రీహరి.. మాదిగలు, మాలలు నోటి కాడి ముద్ద లాక్కుంటుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. ఇప్పుడు ఆయనే గొప్ప అన్ని రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే వివేక్‌కు అధికార దాహం తీరడం లేదు… ఒక్కొక్కరు రెండు, మూడు సీట్లు పంచుకోవచ్చా? ఆలోచించాలన్నారు.

Also Read:దేవరలో అల్లరి నరేష్..క్లారిటీ!

- Advertisement -