దేశంలో కొత్తగా 62,714 మందికి కరోనా..

178
corona
- Advertisement -

దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది లెక్కల ప్రకారం.. గ‌త 24 గంటల్లో 62,714 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 312 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,552కు పెరిగింది.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,71,624కు చేరింది. గ‌త 24 గంటల్లో 28,739 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,23,762 మంది కోలుకున్నారు. 4,86,310 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,02,69,782 మందికి వ్యాక్సిన్లు వేశారు.

- Advertisement -