పుట్టిన రోజున మొక్కను నాటిన ఎన్నారై శుష్మున రెడ్డి..

227
Green Challenge
- Advertisement -

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్( టాక్) మహిళా నాయకురాలు శుష్మున రెడ్డి జన్మదినం సందర్భంగా ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఇచ్చిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ మేరకు, లండన్ సమీపంలోని రీడింగ్ నగరంలోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కను నాటారు శుష్మున రెడ్డి. అదేవిధంగా తన మిత్రులకు శ్రేయోభిలాషులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఎంపీ సంతోష్ తలపెట్టిన ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైనందుకు సంతోషంగా ఉందని శుష్మున తెలిపారు. ఛాలెంజ్‌ను స్వీకరించడమే కాదు గత ఎన్నో సందర్భాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని యూకేలో ప్రమోట్ చేస్తున్న శుష్మున ను అభినందించడమే కాకుండా ఉద్యమ సమయంలో తమతో లండన్ వీధుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై పాల్గొన్న జ్ఞాపకాలను అనిల్ కూర్మాచలం గుర్తుచేసుకున్నారు.

- Advertisement -