దేశంలో 24 గంటల్లో 62,480 కరోనా కేసులు..

171
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 62,480 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1,587 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,97,62,793కు చేరగా మొత్తం 2,85,80,647 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,98,656 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 3,83,490 మంది ప్రాణాలు కోల్పోయారు.
జాతీయ రికవరీ రేటు 96.03 శాతానికి పెరుగగా రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది.

- Advertisement -