సీజేఐకి న్యాయవాదుల సంచలన లేఖ

18
- Advertisement -

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కి 500కి పైగా న్యాయవాదులు సంచలన లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని.. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు.

రాజకీయ ఉద్దేశాలతో ఈ వర్గాలు నిరాధార ఆరోపణలు చేస్తూ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని.. న్యాయవ్యవస్థపై తప్పుడు కథనాలను ప్రచారం చేయడంతో పాటు, ప్రస్తుత విచారణలను కించపరచడం.. న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని లేఖలో ప్రస్తావించారు

న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని.. కొన్ని ప్రత్యేక బృందాలు న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు ఈ దాడులకు వ్యతిరేకంగా రక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ను కోరారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మనన్‌ కుమార్‌ మిశ్రా, ఆదిష్‌ అగర్వాల్‌, చేతన్‌ మిట్టల్‌, పింకీ ఆనంద్‌, హితేష్‌ జైన్‌, ఉజ్వల వార్‌, ఉదయ్‌ హోల్లా, స్వరూపమా చతుర్వేది తదితరులు ఉన్నారు.

Also Read:కాల్షియం తగ్గిందా.. ఇవి తినండి!

- Advertisement -