దేశంలో 24 గంటల్లో 36,571 కరోనా కేసులు

129
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 36,571 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 530 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,23,22,258కు చేరగా 3,15,25,080 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,63,605 యాక్టివ్‌ కేసులుండగా జాతీయ రికవరీ రేటు 97.54 శాతానికి పెరిగింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 57.22 కోట్ల టీకా డోసులు పంపిణీ చేయగా 50.26 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

- Advertisement -