దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా…

120
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 33,750 క‌రోనా కేసులు న‌మోదుకాగా 123 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం 3,42,95,407కు చేరగా ప్ర‌స్తుతం దేశంలో 1,45,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దీంతో భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన‌వారి సంఖ్య 4,81,893 కి చేరింది. విద్యాసంస్థ‌లు, సినిమా హాళ్లు, పార్కులు, జిమ్‌లు వంటి వాటిని మూసివేశారు. కార్యాల‌యాలు 50 శాతంతో ప‌నిచేస్తున్నాయి. కేసులు ఇలానే పెరిగితే మ‌రిన్ని ఆంక్ష‌లు విధించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌కు సూచించింది.

- Advertisement -