గ్రేటర్‌లో కొత్తగా 32 బస్తీ దవాఖానాలు

137
ktr
- Advertisement -

హైదరాబాద్ నగరంలో కొత్తగా 32 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. బాలానగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి హరీష్‌రావు, షేక్‌పేటలో బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్,దూల్‌పేటలో బస్తీ దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

హైదరాబాద్ నగరంలో ప్రజల వద్దకే వైద్య సేవలు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.బస్తీ దవాఖానాలలో ఉచితంగా వైద్య సేవలు, మందులను ప్రజలకు అందజేస్తున్నామని మంత్రి తలసాని వెల్లడించారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తలసాని కోరారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 226 బస్తీ దవాఖానాలు ఉండగా… ఈరోజు నూతనంగా మరో 32 బస్తీ దవాఖానాలను ప్రారంభించామని తలసాని పేర్కొన్నారు.

- Advertisement -