ధాన్యం కొనుగోళ్లపై ఇప్పుడే చెప్పలేం:పీయూష్ గోయల్

135
union minister
- Advertisement -

ధాన్యం కొనుగోళ్లపై రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది కేంద్రం. ఈ మేరకు ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్…ధాన్యం కొనుగోలుపై ఇప్పుడేమీ స్పష్టంగా చెప్పలేమని.. ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాతే యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై ఆలోచిస్తామని తెలిపారు.

బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని …ప్రతి ఏటా వరి ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ వెళ్తుందన్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోళ్లను పెంచుతామని తెలిపారు.

అంతకముందు వరి కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని నిలదీశారు. ఐదు రోజులుగా తెలంగాణ రైతుల గురించి తాము ఆందోళన చేస్తున్నామని, తెలంగాణలో వరి ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

- Advertisement -