రాష్ట్రంలో కొత్తగా 301 కరోనా కేసులు నమోదు..

156
Cases in Telangana
- Advertisement -

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజు తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 301 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈమేరక రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం కరోనా కేసుల వివరాల వెల్లడించింది. తాజా లెక్కల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 293 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,90,309 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,84,217 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,568 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,524 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,459 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 58 కరోనా కేసులు నమోదయ్యాయి.

- Advertisement -