దేశంలో 24 గంటల్లో 26,964 కరోనా కేసులు

108
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 26,964 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 383 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. కరోనా నుండి 3,27,83,741 మంది కోలుకోగా 4,45,768 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశంలో 3,01,989 కేసులు యాక్టివ్‌గా ఉండగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 82,65,15,754 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -