దేశంలో కొత్తగా 25,404 క‌రోనా కేసులు..

115
covid
- Advertisement -

భారత్‌లో గత కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి తగ్గుతోంది. దేశంలో కొత్తగా 25,404 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,32,89,579కి చేరింది. వైర‌స్ బారి నుంచి సుమారు 37 వేల మంది కోలుకున్నారు. ఇక గ‌త 24 గంట‌ల్లో వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 339 కాగా.. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల చ‌నిపోయిన‌వారి సంఖ్య 4,43,213గా ఉంది. ఇక కోవిడ్ వ్యాక్సినేష‌న్ కూడా వేగ‌వంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు 75 కోట్ల మార్క్‌ను దాటింది. గ‌త 24 గంట‌ల్లో 78,66,950 మందికి క‌రోనా టీకా వేసిన‌ట్లు కేంద్రం తెలిపింది.

- Advertisement -