యాదాద్రి అప్‌డేట్..

22
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, యాదాద్రికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో ఈ రెండు దేవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక యాదాద్రికి ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుడిని దర్శనానికి బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు.

Also Read:కొత్త సచివాలయం… ఏఏ అంతస్తులో ఏఏ శాఖలంటే?

స్వామివారి ధర్మదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీతో ఆలయ పరిసర ప్రారంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ​అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Also Read:CM KCR:తెలంగాణ..ప్రగతి వెలుగుల దారి

- Advertisement -