TTD: తిరుమల అప్‌డేట్

67
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు.

Also Read:మల్కపేట..రెండో ట్రయల్ రన్‌ సక్సెస్

ఇక నిన్న 86,181 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 4.59 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆదివారం స్వామివారికి 30,654 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Also Read:డ్రై ఆమ్లా తింటే.. ఎన్ని ఉపయోగాలో!

- Advertisement -